Monday, September 14, 2015

కీర్తన 233
-----------
కనులలోన కలువలు దాచావో
కురులలోన జాబిల్లిని ముడిచావో
మదిలోన మరుమల్లెలై దాగావే
ఎదలోన సిగ్గుమొగ్గలై పూచావే
రతనాలు రువ్వావే రాగాలు పలికించావే
వెన్నెలై విరశావే జల్లులై కురిశావే
చూచానే నిలువుల బిగువులు
తలచానే వలచిన వలపులు
చిందించానే ముసిముసి నగవులు
నిలిపానే మనసున పూల సొబగులు
రావే రావే రతనాల అలిమేల హంస
వేంకటేశుని వడినచేరి వేడుకచేయవే

No comments:

Post a Comment