కీర్తన 127
----
కురిసే ప్రతి చినుకు కడలిని చేరు కడకు
ఎగిసిపడే ప్రతి కెరటం తీరం చేరు చివరకు
పుట్టే ప్రతి ప్రాణం పరమాత్ముని చేరు పరమార్ధం కొరకు
రాలిన ప్రతి విత్తు తిరిగి చిగురించక మానదు
అస్తమిన్చిన సూర్యుడు తిరిగి ఉదయిన్చక మానడు
వెళ్ళిన ప్రతి ప్రాణం మరలా జన్మించక తప్పదు
కానీ కాల గమనం ఆగదు
మన బ్రతుకు తీరు మారదు
ఈ మాయా లోకంలో ఇంకెన్నాళ్ళొ
ఎన్నాళ్ళొ ఎన్నెళ్ళొ ఎవరికి ఎరుక
కానీ ఒకరంటే ఇంకొకరికి ఎందుకో కినుక
మతం లేదు కులం లేదు నీది లేదు నాది లేదు
మత్తు వీడరా కక్ష వద్దురా మనసు మార్చుకోరా
సాటి మనిషికి సాయపడరా చరితలోన మిగిలిపోరా
సదా శ్రీనివాసుని సేవించి స్వర్గాపురి చేరిపోరా..
No comments:
Post a Comment