కీర్తన 162
-----
ఎందరో వస్తారు నాస్వామి నీ కొండకు
ఎందరెందరో వస్తారు నాస్వామి నీ చెంతకు
భక్తులేందరో బారులే తీరేరు నీ కరుణకు
దాసులెందరో భజనలే చేసేరు నీ సేవకు
మహనీయ్యులు మహామహులు మొక్కేరు నీ కృపకు
వేదపండితులు వాగ్గేయకారులు కీర్తించేరు నీ శరణుకు
పడిపడి దండాలు పెడతారు పాపాలు బాపుకొంటారూ
వడ్డీ కాసులు చెల్లిస్తారు వరములు మూటగట్టుకెళతారు
పైసా ఉన్నొళ్ళు లెనొళ్లు పాలకులు పాలిగాళ్ళు ప్రార్ధించేరు
వేషగాళ్ళు మాయగాళ్లు దొరలు దొంగలు దండాలెట్టెరూ
సేవలంటూ నీ చుట్టూ దొంగసాములు చేరి దండుకొనేరు
ముసలోళ్ళు మనసున్నోళ్ళు ముక్తికొరకు పాకులాడేరు
కొండకొచ్చినా వారందరిని చల్లని చూపులతో కరుణించేవు
ఏడుకొండలు ఎక్కిన వారందరికీ వరాలజల్లు కురిపించేవు
No comments:
Post a Comment